గంటకైతే ఓ రేటు... అర్థగంటకో రేటు అంటున్న టాలీవుడ్ నటి! (Video)

శుక్రవారం, 7 ఆగస్టు 2020 (13:41 IST)
తెలుగు సినీ ఇండస్ట్రీలోకి కుర్ర హీరోయిన్ల రాకతో సీనియర్ హీరోయిన్ల హవా తగ్గిపోయింది. ముఖ్యంగా, సినిమా ఛాన్సులన్నీ కుర్ర పిల్లలే తన్నుకునిపోతున్నారు. దీంతో సీనియర్ హీరోయిన్లు తమ ఇళ్ళకే పరిమితమవుతున్నారు. అలాంటి వారిలో తమన్నా, కాజల్ అగర్వాల్, నయనతార, త్రిష, సమంత వంటి వారు అనేక మంది ఉన్నారు. వీరిలో కాజల్, సమంత, నయన్ వంటివారికి మాత్రమే ఇప్పటికీ అవకాశాలు వస్తున్నాయి. దీంతో తమ డిమాండ్ ఎక్కువైతే తమ రేటు(పారితోషికం)ను కూడా బాగానే పెంచుతుంటారు. 
 
ఈ విషయంలో హీరోయిన్లకు ఏమాత్రం మొహమ్మాటాలు ఉండవు. ఎందుకంటే.. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న సామెతను వారు బాగా వంటబట్టించుకునివుంటారు. అందుకే తమ కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉండగానే ఇంటిని చక్కబెట్టేసుకుంటారు. అందుకే, హీరోయిన్ వేషమైనా, ఐటం సాంగ్ అయినా, గెస్ట్ రోల్ అయినా తమ డిమాండును బట్టి నిర్మాత నుంచి ముక్కుపిండి మరీ వసూలు చేస్తారు. 
 
తాజాగా అందాలభామ కాజల్ అగర్వాల్ కూడా అలాగే ఓ సినిమాలో గెస్ట్ పాత్ర పోషించినందుకు భారీ మొత్తంలో ఛార్జ్ చేసిందట. రానా కథానాయకుడుగా హిందీలో రూపొందుతున్న 'హాథీ మేరీ సాథీ' చిత్రంలో కాజల్ ఓ గెస్ట్ రోల్ చేసింది. ఇందులో ఆమె పాత్ర నిడివి అరగంట సేపు మాత్రమే ఉంటుందట. ఇందుకుగాను ఆమె సుమారు 70 లక్షలు తీసుకున్నట్టు సమాచారం. ఇందులో ఆమె ఆదివాసీ యువతిగా కనిపిస్తుంది. దీంతో వాళ్ల సంప్రదాయాల ప్రకారం బ్లౌజ్ వేసుకోకుండా కేవలం చీరకట్టులోనే అమ్మడు కనిపిస్తుందట. 
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు