సీనియర్ నటి ఖుష్భూ నిర్మాతల మండలి అధ్యక్ష పదవికి పోటీచేయబోతున్న సంగతి తెలిసిందే. కోలీవుడ్లో సంచలనం సృష్టిస్తున్న నిర్మాతల మండలి అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నారని విశాల్ ప్రకటించడం అంతటా చర్చనీయాంశంగా మారింది. విశాల్ను నిర్మాతల మండలి నుంచి తొలగించిన కారణంగానే పంతానికి ఈ పనిచేస్తున్నాడని పలువురు విమర్శి స్తున్న నేపథ్యంలో... తను ఎందుకు పోటీచేస్తున్నానో ఖుష్బూ వెల్లడించారు.
విశాల్ ఆడుతున్న ఆటలో తనను పావుగా చేశారని కొంతమంది భావిస్తున్నారని, తాను బాగా చదువుకున్న.. లోకజ్ఞానం తెలిసిన మహిళని.. తాను నిర్ణయాలు తాను తీసుకోగలనని.. విశాల్ కోసమే తాను పోటీ చేయడం లేదని ఘాటుగానే ఖుష్భూ బదులిచ్చారు.