బాహుబలి, ఆర్ఆర్ఆర్ ఎలా హిట్టయ్యాయో అర్థం కావట్లేదు.. శాకుంతలంకు ఏమైంది?

గురువారం, 27 ఏప్రియల్ 2023 (10:59 IST)
సీనియర్ నటి మధుబాల సంతోషంగా లేరు. ఎందుకంటే ఆమె నటించిన తెలుగు సినిమా శాకుంతలం కాంతారావు’ లేదా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ అవుతుందని ఆశించింది. ఇది పాన్-ఇండియన్ దిగ్విజయంగా మారుతుందని ఆమె ఊహించింది. కానీ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. 
 
సమంత ప్రధాన కథానాయికగా నటించిన ‘శాకుంతలం’ ఫట్ కావడంతో ఆమె తీవ్ర నిరాశకు గురైంది. ఈ సినిమాలో సమంతకు తల్లిగా మధు నటించింది. ఇది భారతదేశం అంతటా పెద్ద హిట్ అవుతుందని భావిస్తున్నట్లు మధు ఇటీవల ఒక ఇంటర్వ్యూలో అంగీకరించింది. కొన్నిసార్లు కొన్ని సినిమాలు ఎందుకు జనాదరణ పొందాయో మాకు అర్థం కాదు. శాకుంతలం కూడా ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే సినిమా అని తెలిపింది. 
 
అయితే అతిలోక సుందరి మేనకగా నటించిన తాను ట్రోలింగ్‌‌కు గురైయ్యాయనని చెప్పుకొచ్చింది. సమంత ప్రధాన పాత్ర పోషించిన 'శాకుంతలం' సినిమా భారీ అంచనాలతో విడుదలైంది. ఈ చిత్రంలో మోహన్ బాబు, ప్రకాశ్ రాజ్, గౌతమి, కబీర్ బేడీ, మధుబాల, అనన్య నాగళ్ల తదితరులు కీలక పాత్రలను పోషించారు. 
 
ఈ చిత్రం ఫ్లాప్ కావడం బాధించిందని, ప్రేక్షకులకు విజువల్ ట్రీట్ ఇవ్వాలని ఎంతో కష్టపడ్డారని తెలిపారు. బాహుబలి', 'ఆర్ఆర్ఆర్' వంటి చిత్రాలు ఘన విజయం సాధించాయని.. ఆ చిత్రాలు ఆ రేంజ్‌లో ఎలా హిట్ అయ్యాయో అర్థం కావడం లేదని వెల్లడించింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు