Refresh

This website p-telugu.webdunia.com/article/telugu-cinema-news/mahadev-betting-scam-maharashtra-cyber-cell-sent-to-actress-tamannah-124042500012_1.html is currently offline. Cloudflare's Always Online™ shows a snapshot of this web page from the Internet Archive's Wayback Machine. To check for the live version, click Refresh.

మిల్కీబ్యూటీకి సైబర్ సెల్ సమన్లు.. ఎందుకబ్బా?

వరుణ్

గురువారం, 25 ఏప్రియల్ 2024 (12:33 IST)
చిత్రపరిశ్రమలో మిల్కీబ్యూటీగా గుర్తింపు పొందిన తమన్నా భాటియాకు మహారాష్ట్ర సైబర్ సెల్ విభాగం సమన్లు జారీ చేసింది. మహాదేవ్ బెట్టింగ్ యాప్‌‍ కేసులో ఈ నెల 29వ తేదీన విచారణకు హాజరుకావాలని ఆమెకు కబురు పంపించారు. మహాదేవ్ అనుబంధ సంస్థ ఫెయిల్ ప్లే యాప్‌ను గతంలో బ్రాండ్ అంబాసిడర్‌గా ఉంటూ ఆ యాప్‌ను ప్రమోట్ చేశారు. 
 
అయితే, గత యేడాది ఐపీఎల్ మ్యాచ్‌లను ఫెయిర్ ప్లే యాప్ చట్ట విరుద్ధంగా స్ట్రీమింగ్ చేసిందంటూ, దీనివల్ల తమకు కోట్లాది రూపాయల మేరకు నష్టం వాటిల్లిందని ఐపీఎల్ ప్రసార హక్కులు పొందిన వయాకామ్ ఆరోపిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ కేసులో విచారణకు హాజరుకావాలని సమన్లలో పేర్కొంది. 
 
కాగా, బాలీవుడ్ నటుడు సంజయ్ దత్‍‌కు కూడా ఇదే కేసులో ఈ నెల 23వ తేదీన హాజరుకావాలని సైబర్ సెల్ సమన్లు జారీ చేసింది. అయితే, తాను విదేశాల్లో ఉన్నందున ఆ రోజున విచారణకు హాజరుకాలేనని, తన వాంగ్మూలాన్ని నమోదు చేసేందుకు మరో తేదీ, సమయం పంపాలని సంజయ్ దత్ సైబర్ సెల్‌ను కోరిన విషయం తెల్సిందే. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు