దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల, ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్లో తెరకెక్కుతున్న 'బ్రహ్మోత్సవం'. ఫ్యామిలీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సమంత, కాజల్, ప్రణీతలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. మిక్కీ జే మేయర్ మరోసారి మహేష్ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. షూటింగ్ మొత్తం దాదాపు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆడియోని ముందుగా మే 1వ తేదీన తిరుపతిలో రిలీజ్ చెయ్యాలని భావించిన చిత్ర టీం తర్వాత మే 7న హైదరాబాద్ శిల్పకళావేదికలో విడుదల చెయ్యడానికి డిసైడ్ చేశారు.
ఇప్పుడు తాజాగా నాగార్జున మహేష్ 'బ్రహ్మోత్సవం' చిత్రం ఆడియోకి ముఖ్య అతిథిగా రాబోతున్నాడు. ఇంకో ఆసక్తికర విషయమేంటంటే ఈ చిత్రం వర్కింగ్ స్టిల్స్ శుక్రవారం విడుదలైంది. ఈ చిత్ర బృందం ఫేస్బుక్లో వర్కింగ్ స్టిల్స్ను విడుదల చేసింది. పివిపి బ్యానర్పై వస్తున్నఈ చిత్రంలో సీనియర్ నటి జయసుధ, రేవతి, ప్రముఖ నటుడు సత్యరాజ్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. మే 20న ఈ చిత్రం ప్రేక్షకుల మందుకు రానుంది.