చిరంజీవి సర్జా తొలి వర్థంతి.. నటి మేఘనా రాజ్‌ ఎమోషనల్ పోస్ట్

సోమవారం, 7 జూన్ 2021 (17:05 IST)
chiranjeevi Sarja
కన్నడ స్టార్‌ హీరో, దివంగత నటుడు చిరంజీవి సర్జా మృతి చెంది నేటితో ఏడాది అయ్యింది. ఈ సందర్భంగా ఆయన భార్య, నటి మేఘనా రాజ్‌ ఓ ఎమోషనల్ పోస్టు చేశారు. గతేడాది జూన్‌ 7వ తేదీన చిరు సర్జా గుండెపోటుతో తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. 
 
చిరంజీవి సర్జా మృతి చెందే సమయానికి మేఘన అయిదు నెలల గర్భవతిగా ఉన్న విషయం తెలిసిందే. గతేడాది అక్టోబర్‌లో జూనియర్‌ సర్జాకు ఆమె జన్మనిచ్చింది. అప్పటి నుంచి అతడికి సంబంధించిన ప్రతి వీడియోలను, ఫొటోలను ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియాలో ఆమె షేర్‌ చేస్తున్నారు. 
 
అంతేగాక సర్జాతో తనకున్న జ్ఞాపకాలను తరచూ అభిమానులతో పంచుకుంటూ ఆమె భావోద్వేగానికి లోనవుతున్నారు. తాజాగా ఆమె పోస్టు చేసిన ఫోటోలో చిరు, మేఘనాలు మాట్లాడుకుంటుండగా ప్రేమతో ఆమెను చూస్తున్నట్లుంది. 
 
దీనికి మేఘన ఎమోషనల్‌ క్యాప్షన్‌తో హార్ట్‌ ఎమోజీని జోడించి అభిమానులను, నెటిజన్లను కదిలించారు. తన పోస్టు ప్రముఖ నటి, మేఘన సన్నిహితురాలు నజ్రీయా నజీంతో పాటు పలువురు నటీనటులు స్పందించారు. ఈ పోస్టు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు