అమలాపాల్ భేష్.. ధైర్యాన్ని కొనియాడిన నడిగర్ సంఘం

సోమవారం, 5 ఫిబ్రవరి 2018 (12:23 IST)
సినీనటి అమలాపాల్‌ను నడిగర్ సంఘం అభినందించింది. లగ్జరీ కారు కేసులో పన్ను ఎగవేతతో కష్టాలు ఎదుర్కొన్న అమలాపాల్, లైంగిక వేధింపులకు గురైంది. లైంగిక వేధింపులకు గురైన వెంటనే ఆ విషయాన్ని దాచకుండా పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై అమలాపాల్‌ను నడిగర్ సంఘం అభినందించింది. ఈ విషయంలో అమలాపాల్ ధైర్యాన్ని నడిగర్ సంఘం కొనియాడింది.
 
ఈ మేరకు ఓ ప్రకటనను కూడా నడిగర్ సంఘం విడుదల చేసింది. లైంగిక వేదింపుల గురించి కొంతమంది నటీమణులు బయటకు మాట్లాడేందుకు వెనుకాడుతున్న తరుణంలో తనకు జరిగిన అన్యాయంపై ధైర్యంగా ముందుకు రావడం అభినందనీయమని తెలిపింది. ఈ కేసుపై పోలీసులు వెంటనే స్పందించి కేసును నమోదు చేసినందుకు నడిగర్ సంఘం కృతజ్ఞతలు తెలియజేసింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు