బయటెక్కడో ఉన్నాడు. ఉండకూడదు.. మన పిల్లలు సేఫ్‌గా ఉంటారా..?

బుధవారం, 15 సెప్టెంబరు 2021 (15:12 IST)
Nani Mahesh
నేచురల్ స్టార్ నాని 'బయటెక్కడో ఉన్నాడు. ఉండకూడదు' అంటూ ట్వీట్ చేశారు. అయితే ఇది సినిమాల గురించి కాదు. ఆరేళ్ళ చిన్నారిపై జరిగిన హత్యాచార ఘటనపై నాని స్పందన. సైదాబాద్ లోని సింగరేణి కాలనీలో ఓ ఆరేళ్ళ చిన్నారిని క్రూరంగా హత్యాచారం చేసిన నిందితుడిపై రాష్ట్రవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ప్రజలతో పాటు సెలెబ్రిటీలు సైతం ఈ అమానవీయ ఘటనపై మండిపడుతున్నారు. 
 
పోలీసులు త్వరగా నిందితుడిని పట్టుకోవాలని, వాడిని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు. ఈ పరిస్థితుల్లో నిందితుడు పొరపాటున ఎవరి కళ్ళల్లోనైనా పడ్డాడంటే అంతే సంగతులు. ఈ నేపథ్యంలో ఘటనపై మంచు మనోజ్, మహేష్, నాని వంటి సెలెబ్రిటీలు సైతం తమ గళం వినిపిస్తున్నారు. తాజాగా నాని 'బయటెక్కడో ఉన్నాడు. ఉండకూడదు' అంటూ ఈ ట్వీట్ ను పోలీసులు నిందితుడిని పట్టుకోవడానికి జారీ చేసిన వాంటెడ్ నోట్ ను యాడ్ చేశారు.
 
ఇప్పటికే మంచు మనోజ్ సైతం ఆ చిన్నారి కుటుంబాన్ని పరామర్శించగా, మహేష్ బాబు కూడా 'మన పిల్లలు సేఫ్‌గా ఉంటారా ?' అంటూ సూటిగా ప్రశ్నించారు. అంతేకాదు పోలీసులు త్వరగా నిందితుడిని పట్టుకుని ఆ చిన్నారి కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. దేశవ్యాప్తంగా ఈ ఘటనపై దుమారం చెలరేగుతుండడంతో పోలీసులు కూడా ఈ విషాదకర ఘటనను సీరియస్‌గా తీసుకున్నారు. 
 
ఈ మేరకు సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించి అతని ఫోటోను బయట పెడుతూ నిందితుడిని పట్టించిన వారికి 10 లక్షల బహుమానం ఉంటుందని ప్రకటించారు. నిందితుడి పేరు రాజు. అతనికి సంబంధించితిన్ గుర్తులను సైతం ఈ వాంటెడ్ నోట్ లో స్పష్టంగా వెల్లడించారు పోలీసులు. చుట్టూ ఓ కన్నేసి ఉంచండి. ఇలాంటి రాక్షసులు మన మధ్యనే దాగి ఉంటారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు