నారాయణ మూర్తి మాట్లాడుతూ, పూర్వకాలంలో ప్రజల దగ్గరికే రాజులు వచ్చి వాళ్ళ సమస్యలు వినేవారు. అలాగే ఇప్పుడున్న మినిస్టర్ లు కూడా సినిమా రంగంలో సమస్యలు ఏమి వున్నాయో అని అడగాలి. పర్సెంటేజీ సిస్టమ్ కావాలి. ప్రైవేట్ సంస్థలు థియేటర్లను ఆక్యుపై చేశాయి. వాటిని మీరు పరిశీలించాలి.
కొందరు ఎగ్జిబిటర్లు జూన్ 1 నుంచి బంద్ ప్రకటించడం అనేది చాలా తప్పు. స్వయంగా పవన్ ఆఫీస్ నుంచి, సినిమాటోగ్రఫీ నుంచి బంద్రా గురించి వివరణ రావడం విచిత్రం. అసలు బంద్ అనేది మూడు వారాలముందు తెలియజేయాలి. అది రూల్. అలా కాకుండా స్టేట్ మెంట్ ఇవ్వడం కరెక్ట్ కాదు. నిర్మాతల్ని ఇబ్బంది కలిగించకూడదు. పవన్ కళ్యాణ్ మీద ఎవరు కుట్రపన్నుతారు. గతంలో ఎన్.టి.ఆర్. తెలుగు జాతిని ఖ్యాతి తెచ్చారు. ఆ తర్వాత అంతటివాడిగా డిఫ్యూటీ సి.ఎం.గా ఎదిగిన పవన్ కళ్యాణ్ ను గౌరవిస్తున్నాం. కానీ పవన్ కళ్యాణ్ ఆఫీసు నుంచి లెటర్ రావాల్సిందికాదు. చంద్రబాబుతో మాట్లాడి హరిహరవీరమల్లు అనే టాపిక్ చెప్పకుండా సినిమా పెద్దల్ని రండి అని ఆహ్వానిస్తే చాలా మంచిది. ఈ విషయాన్ని సవినయంగా పవన్ గారికి విన్నవిస్తున్నాను అని అన్నారు.