నాచుర‌ల్‌గానే బ‌రువు త‌గ్గాః అక్ష‌య్‌కుమార్‌

సోమవారం, 12 జులై 2021 (16:21 IST)
Akshay Kumar
ఫిట్‌నెస్ విష‌యంలో న‌టీన‌టులంతా చాలా కేర్ తీసుకుంటుంటారు. అందులో అక్ష‌య్‌కుమార్ ముందుంటాడు. క‌మ‌ల్‌మాస‌న్ బ‌రువు పెర‌గాల‌న్నా, త‌గ్గాల‌న్నా ప్ర‌త్యేక‌మైన శ్ర‌ద్ధ తీసుకుంటాడు. ఇప్పుడు అక్ష‌య్ కుమార్ కూడా అదే బాట‌లో వున్నాడు. తాజాగా ఆయ‌న ఆనంద్ ఎల్ రాయ్ నేతృత్వంలో రూపొందుతోన్న చిత్రం `రక్షా బంధన్`లో న‌టిస్తున్నాడు. ఈ చిత్రంలోని పాత్ర కోసం 5కేజీలు బ‌రువు త‌గ్గాడు. దీనిపై అక్ష‌య్ స్పందిస్తూ,  ప్ర‌కృతిసిద్ధంగానే నేను బ‌రువుతు త‌గ్గుతాను. పెరుగుతాను. నేను పూర్తిగా సహజ ప్రక్రియలో 5 కిలోలు త‌గ్గాను. ఇది మేరీ మా కే హాత్ కా హల్వా తినడం వ‌ల్ల‌నేనంటూ ట్వీట్ చేశాడు.
 
ఇందులో దిల్లీ కా లడ్కా పాత్రలో నటించాడు. చిన్న‌త‌నంలో ఢిల్లీలోని చాంద‌నిచౌక్‌లోనే ఆయ‌న గ‌డిపాడు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, రోహిత్ శెట్టి సూర్యవంశీలో ఒక పోలీసుగా సన్నగా కనిపించడానికి అతను ఆరు కిలోలు త‌గ్గాల్సివ‌చ్చింది. ఆ త‌ర్వాత మ‌ర‌లా పెరిగాడు. ఇక ర‌క్షాబంధ‌న్‌లో ఐదుగురు కొత్త‌వారిని  సోదరీమణులుగా ప‌రిచ‌యం చేస్తున్నారు. అక్షయ్​ కుమార్​, నానా పాటేకర్, భూమి పెడ్నేకర్​ ప్రధాన పాత్రల్లో నిర్మిస్తున్న హిందీ సినిమా. ఈ సినిమాను 2021 నవంబర్‌ 5న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు నిర్మాతలు తెలిపారు. జీ స్టూడియోస్క, లర్ యెల్లో ప్రొడక్షన్స్, కేప్ అఫ్ గుడ్ ఫిలిమ్స్ నిర్మాణంలో రూపొందుతోంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు