న్యూయార్క్ టైమ్ స్క్వేర్ వద్ద ధూం ధాం డ్యాన్సులతో ఎన్ఆర్ఐలు సందడి

డీవీ

శనివారం, 7 సెప్టెంబరు 2024 (16:35 IST)
NRIs dances at New York's Time Square
చేతన్ కృష్ణ, హెబ్బా పటేల్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా "ధూం ధాం". సాయి కుమార్, వెన్నెల కిషోర్, పృథ్వీరాజ్, గోపరాజు రమణ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఫ్రైడే ఫ్రేమ్ వర్క్స్ బ్యానర్ పై ఎంఎస్ రామ్ కుమార్ నిర్మిస్తున్నారు. "ధూం ధాం" సినిమాను లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా దర్శకుడు సాయి కిషోర్ మచ్చా రూపొందిస్తున్నారు. గోపీ మోహన్ స్టోరీ స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. ఈ సినిమా ఈ నెల 13న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.
 
ఈ నేపథ్యంలో "ధూం ధాం" సినిమా ప్రమోషన్స్ అమెరికాలో కూడా జోరుగా సాగుతున్నాయి. తాజాగా ప్రఖ్యాత న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ వద్ద ఈ సినిమాలోని 'మల్లెపూల టాక్సీ..' పాటను ప్రదర్శించారు. ఈ పాట స్క్రీనింగ్ కు పెద్ద సంఖ్యలో ఎన్ఆర్ఐలు హాజరయ్యారు. ముఖ్యంగా తెలుగు వారు 'మల్లెపూల టాక్సీ..' పాటకు డ్యాన్సులు చేస్తూ సందడి చేశారు. ఈ పాటకు మన వాళ్లు చేస్తున్న సందడి అమెరికన్స్ దృష్టిని కూడా ఆకట్టుకుంది. ఈ నెల 12వ తేదీన "ధూం ధాం" సినిమా యూఎస్ ప్రీమియర్స్ మొదలవుతున్నాయి.
నటీనటులు - చేతన్ కృష్ణ, హెబ్బా పటేల్, సాయి కుమార్, వెన్నెల కిషోర్, పృథ్వీరాజ్, గోపరాజు రమణ, శివన్నారాయణ, బెనర్జీ, సాయి శ్రీనివాస్, ప్రవీణ్, నవీన్ నేని, గిరిధర్, భద్రమ్ తదితరులు

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు