ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణా నదికి పోటెత్తిన వరద, బుడమేరు పరిస్థితి ఏంటి? (video)

ఐవీఆర్

బుధవారం, 13 ఆగస్టు 2025 (15:41 IST)
కృష్ణానదికి వరద పోటెత్తుతోంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో అన్ని ప్రాజెక్టుల్లో భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. పులిచింతల ప్రాజెక్టు నుంచి మంగళవారం నాడు 2 లక్షల క్యూసెక్కుల వరద నీటిని విడుదల చేయడంతో ఈ నీరు ప్రకాశం బ్యారేజీకి చేరుతోంది. బ్యారేజి వద్ద 3 లక్షల క్యూసెక్కులకు పైగా వరద నీరు వచ్చే అవకాశం వుందనీ, కనుక కృష్ణా పరీవాహక ప్రాంతంలోని లోతట్టు ప్రజలు ఎంతో అప్రమత్తంగా వుండాలని అధికారులు సూచిస్తున్నారు.
 

Food Waters at Prakasam Barrage in Vijayawada of AP pic.twitter.com/dwAreTVJuX

— Ch. Vijaya Bhaskar (@CHVSVB) August 13, 2025
మరోవైపు ఎగువ ప్రాంతాల్లో నిన్నటి నుంచి అతిభారీ వర్షాలు కురుస్తుండటంతో ఆ నీరు కూడా కృష్ణా నదిలోకి వస్తున్నాయి. మొత్తమ్మీద బ్యారేజీ వద్ద 5 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చే ప్రమాదం వుందనీ, నది వద్దకు ఎవ్వరూ వెళ్లవద్దనీ, కృష్ణా పరివాహక ప్రాంతవాసులు అప్రమత్తంగా వుండాలని జిల్లా అధికారులు హెచ్చరిస్తున్నారు.
 

Due to heavy rain in Mahububabad region in old Warangal district, Munneru River and it’s tributaries flooding.

Munneru River joins Krishna River before Prakasam Barrage.

Video - Sampath Boddu pic.twitter.com/fbculTx6AR

— Naveen Reddy (@navin_ankampali) August 13, 2025
ఇదిలావుంటే... గత ఏడాది విజయవాడ నగరాన్ని బుడమేరు వరద ముంచెత్తింది. ఈ నేపధ్యంలో వెలగేరు రెగ్యులేటర్ వద్ద బుడమేర వరద పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించేందుకు గాను ఓ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఆదేశించారు. వచ్చే రెండుమూడు రోజుల పాటు అతిభారీ వర్షం కురవనున్న నేపధ్యంలో సంబంధిత సిబ్బంది అప్రమత్తంగా వుండాలని సూచించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు