ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ మూవీ టైటిల్ అండ్ ఇంట్రస్టింగ్ అప్‌డేట్..!

శనివారం, 13 జూన్ 2020 (21:45 IST)
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ మూవీ చేస్తున్నారు. దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాని భారీ చిత్రాల నిర్మాత డి.వి.వి దానయ్య నిర్మిస్తున్నారు. నందమూరి హీరో ఎన్టీఆర్ - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలయికలో రూపొందుతోన్న ఈ మూవీ ఎప్పుడెప్పుడు వస్తుందా అని అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
 
ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్... మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌తో సినిమా చేయనున్నారు. ఈ సినిమాని ప్రముఖ నిర్మాణ సంస్థలు హారిక అండ్ హాసిని క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించనున్నాయి.
 
లాక్ డౌన్ లేకపోతే ఈపాటికే ఈ సినిమా స్టార్ట్ అయ్యేది కానీ... కరోనా కారణంగా స్టార్ట్ కాలేదు. ఇదిలా ఉంటే... ఎన్టీఆర్ కొత్త సినిమా గురించి ఓ ఇంట్రస్టింగ్ అప్‌డేట్ బయటకు వచ్చింది. అది ఏంటంటే... కేజీఎఫ్ సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన ప్రశాంత్ నీల్‌తో ఎన్టీఆర్ ఓ మూవీ చేయనున్నారు అని గత కొంతకాలంగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.
 
ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో మూవీని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించనుంది. ఈ భారీ చిత్రానికి మిస్సైల్ అనే టైటిల్ పెట్టాలనుకుంటున్నారని తెలిసింది. 
 
కథకు కరెక్ట్‌గా ఈ టైటిల్ సరిపోతుందని.. అందుకని ఈ టైటిల్‌నే ఫిక్స్ చేయనున్నట్టు సమాచారం. వచ్చే సంవత్సరంలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. మరి.. ఈ మూవీ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేయనుందో చూడాలి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు