Udaya Bhanu: పవన్ కల్యాణ్ పరువు తీసిన ఉదయ భాను.. ఏంటి?

సెల్వి

సోమవారం, 9 జూన్ 2025 (12:14 IST)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పరువు తీసింది యాంకర్ ఉదయభాను. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా అనేక అడ్డంకులు పడుతూ ఇబ్బందుల్లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా జూన్ 12న విడుదలని చెప్పి ఆ విడుదల తేదీని కూడా వాయిదా వేసేశారు. ఇక ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుందో కూడా తెలియని పరిస్థితి ఏర్పడింది. 
 
అయితే ఇలాంటి సమయంలో తాజాగా ఈ సినిమాకి డైరెక్టర్‌గా పనిచేసిన జ్యోతి కృష్ణ ఓ ప్రైవేట్ ఈవెంట్ పెట్టారు. ఈ సినిమాలోని ఒక పాట పవన్ కళ్యాణ్‌కి చాలా ఇష్టం. ఆ పాట ఆయన దాదాపు 500 సార్ల వరకు చూసి ఉంటారు.. అంటూ లైవ్ లోనే ఆ పాటని ప్లే చేయించారు.
 
దీనిపై ఉదయభాను పవన్ కళ్యాణ్ పరువు గంగలో కలిపేసింది. ఎందుకంటే పాట ప్లే చేస్తుండగా మధ్యలోకి వచ్చి పవన్ కళ్యాణ్ 500 సార్లు ఆ పాటను చూశారంటే కచ్చితంగా పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో ఓ పాట పాడే ఉంటారు. ఆ రహస్యాన్ని మీరు దాచేస్తున్నారు. ఇందులో పవన్ కళ్యాణ్ పాడిన ఆ పాట ఏంటో మీరు చెప్పాల్సిందే అంటూ మాట్లాడింది. 
 
కానీ హరిహర వీరమల్లు సినిమాలో పవన్ కళ్యాణ్ మాట వినాలి అనే పాట పాడారు. ఈ పాట కూడా ఎప్పుడో విడుదలైంది. అయితే అలా విడుదలైన విషయం కూడా ఉదయభానుకి తెలియకపోవడం నిజంగా పవన్ కళ్యాణ్‌కి ఆయన అభిమానులకి అవమానమే అంటున్నారు చాలామంది ఈ వీడియో చూసిన నెటిజన్స్.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు