పీరియడ్. ఎండ్ ఆఫ్ సెంటెన్స్‌కు ఆస్కార్ అవార్డ్... రుతుక్రమం సమయంలో?

సోమవారం, 25 ఫిబ్రవరి 2019 (13:09 IST)
ఆస్కార్ పండుగ మొదలైంది. ఇందులో భారతీయ డాక్యుమెంటరీకి ఆస్కార్ అవార్డు లభించింది. ప్రముఖ నిర్మాత గునీత్‌ మోంగా, రేకా జెహతాబ్చి దర్శకత్వంలో నిర్మించిన 'పీరియడ్‌: ఎండ్‌ ఆఫ్‌ సెంటెన్స్‌' సినిమా ఆస్కార్ న్యాయ నిర్ణేత మనస్సును గెలుచుకుంది. తద్వారా అమెరికాలో జరిగే ఆస్కార్ అవార్డు వేడుకల్లో ఈ అవార్డును ఈ సినిమా గెలుచుకుంది. 
 
భారత్‌లో పలు ప్రాంతాల్లోని అమ్మాయిలు రుతుక్రమం సమయంలో ఎదుర్కొనే ఇబ్బందులకు మోంగా ఇచ్చిన దృశ్య రూపమే ఈ డాక్యుమెంటరీ. 25 నిమిషాల నిడివి ఉన్న ఈ డాక్యుమెంటరీని ఉత్తరప్రదేశ్‌లోని హపూర్‌ ప్రాంతంలో తెరకెక్కించారు. ఈ  ప్రాంతానికి చెందిన మహిళలు బయోడీగ్రేడబుల్‌ నాప్‌కిన్లు ఎలా తయారు చేస్తారు, వాటిని అతి తక్కువ ధరకు అమ్ముతూ ఇతరులకు ఎలా సాయపడతారని ఈ డాక్యుమెంటరీలో చూపించారు. 
 
ఈ సినిమా ఆస్కార్ గెలుచుకున్న సందర్భంగా దర్శకులు రేకా జెహతాబ్బి మాట్లాడుతూ ఉద్వేగానికి లోనయ్యారు. మహిళలు ఎదుర్కొనే సాధారణ సమస్యపై తాను డాక్యుమెంటరీ తీస్తే ఆస్కార్‌ అవార్డు వచ్చిందంటే నమ్మలేకపోతున్నానని చెప్పారు. దీంతో ఈ సినిమా యూనిట్ మొత్తం హర్షం వ్యక్తం చేసింది. సోషల్ మీడియాలో ఈ డాక్యుమెంటరీపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు