ప్రభాస్‌‌తో గొడవలా.. అతనో స్వీట్ పర్సన్.. బుట్టబొమ్మ

మంగళవారం, 8 మార్చి 2022 (16:56 IST)
బుట్టబొమ్మతో ప్రభాస్‌కు గొడవలని ఫిలిమ్ నగర్ వర్గాల్లో టాక్ వచ్చింది. వీరిద్దరూ కలిసి నటిస్తున్న చిత్రం రాధేశ్యామ్ ఇంకో వారంలో విడుదల కానుంది.

ఈ నేపథ్యంలో ప్రమోషనలలో బిజీగా ఉన్న చిత్ర బృందం సినిమా గురించి ఆసక్తికరమైన విషయాలను అభిమానులతో పంచుకుంటుంది. ఇక ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో ప్రభాస్ తో గొడవపై పూజా నోరు విప్పింది.
 
పూజా హెగ్డే మాట్లాడుతూ.. ప్రభాస్ చాలా స్వీట్ పర్సన్.. ఆయనతో కలిసి నటించడం నా అదృష్టం.. ఆయనతో కలిసి పనిచేసిన రోజులన్నీ అద్భుతం.. ఈ పుకార్లలో నిజం లేదు.

నిజానికి అతను నాకు మా అమ్మకు కూడా ఇంట్లో తయారుచేసిన ఆహారాన్ని పంపాడు. ఇలాంటి ఆధారాలు లేని వార్తలను ప్రచారం చేయడం ఆపండి" అంటూ చెప్పుకొచ్చింది. ఇకపోతే.. మార్చి 11న రాధేశ్యామ్ విడుదల కానుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు