హ్యాకైన ఫేస్‌బుక్ .. ఒక్కో ఖాతా రూ.7కి విక్రయం .. మీ ఖాతా కూడా ఉందా?

ఆదివారం, 4 నవంబరు 2018 (10:36 IST)
సోషల్ మీడియా దిగ్గజాల్లో ఒకటైన ఫేస్‌బుక్ హ్యాకైంది. సైబర్ నేరగాళ్లు ఏకంగా 12 కోట్ల ఖాతాలను హ్యాక్ చేశారు. ఆపై.. ఒక్కో ఖాతాను రూ.7 చొప్పున విక్రయానికిపెట్టారు. ఫేస్‌బుక్ యాజమాన్యాన్ని వణికిస్తున్న ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ప్రపంచ వ్యాప్తంగా 12 కోట్ల ఫేస్‌బుక్‌ ఖాతాలను సైబర్‌ నేరగాళ్లు హ్యాక్‌ చేశారు. అందులో 81 వేల అకౌంట్లలోని సమాచారాన్ని ఆన్‌లైన్‌లో పెట్టేశారు. ఒక్కో అకౌంట్‌ను 10 సెంట్ల (సుమారు రూ.7) చొప్పున అమ్మకానికి ఉంచారు. కేంబ్రిడ్జ్‌ అనలైటికా కుంభకోణం తర్వాత అతి పెద్ద సెక్యూరిటీ వైఫల్యంగా దీనిని భావిస్తున్నారు. 
 
ఉక్రెయిన్‌, రష్యా, యూకే, అమెరికా, బ్రెజిల్‌ తదితర దేశాలకు చెందిన యూజర్ల ఖాతాలు ఎక్కువగా ఆన్‌లైన్‌లో ఉన్నట్లు చెబుతున్నారు. వాస్తవానికి హ్యాకింగ్‌ గురించి సెప్టెంబరులోనే గుప్పుమన్నా ఫేస్‌బుక్‌ యాజమాన్యం కొట్టిపారేసింది. కానీ, ఇపుడు సైబర్ నేరగాళ్ల చర్యను తెలుసుకుని దిగ్భ్రంతికి గురైంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు