అయితే శక్తి చిత్రంపై ఆ చిత్ర నిర్మాణ వ్యహరాలు పర్యవేక్షించిన అశ్వనీదత్ కుమార్తె స్వప్నాదత్ మాట్లాడుతూ.. ‘ఆ సినిమా చేసి చాలా పెద్ద పొరపాటు చేశామని అందరూ అంటుంటారు. అయితే దర్శకుడు చెప్పిన కథ విన్నప్పుడు మాకు చాలా నచ్చింది. ఎన్టీఆర్ కూడా కథ నచ్చే ఆ సినిమా చేశాడు. అందుకే అంత భారీ బడ్జెట్తో ఆ సినిమా చేయాలనుకున్నాము. కానీ, మేము విన్న కథ తెర మీదకు సవ్యంగా రాలేదు. అలాగే ఓ చెత్త సినిమా చేయడానికి మేముగానీ, ఎన్టీయార్గానీ ఫూల్స్ కాము కదా’ అంటూ స్వప్న సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ వ్యాఖ్యలు టాలీవుడ్లో పెద్ద చర్చనీయాంశంగా మారాయి.