దిల్ రాజుకి సతీ వియోగం... గుండెపోటుతో....

శనివారం, 11 మార్చి 2017 (20:25 IST)
ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజుకి సతీ వియోగం కలిగింది. ఆయన సతీమణి అనిత శనివారం నాడు గుండెపోటుతో కన్నుమూశారు. ఆమె వయసు 46 ఏళ్లు. ఆమెకు హైదరాబాదులోని అపోలో ఆసుపత్రిలో చికిత్స అందిస్తుండగా తుదిశ్వాస విడిచారు. దిల్ రాజు ప్రస్తుతం అమెరికాలో వున్నారు. ఆయన వరుణ్ తేజ్ చిత్రం ఫిదా షూటింగ్ నిమిత్తం అక్కడికి వెళ్లారు. 
 
తన సతీమణి మృతి వార్త తెలియగానే ఆయన అమెరికా నుంచి బయలుదేరారు. దిల్ రాజుకు సతీ వియోగం వార్త తెలియగానే సినీ ప్రముఖులు ఆయన కుటుంబానికి సంతాపాన్ని తెలియజేశారు.

వెబ్దునియా పై చదవండి