ఉగాది కానుకగా ఓటిటీలోకి రాధే శ్యామ్

మంగళవారం, 15 మార్చి 2022 (09:33 IST)
ప్రభాస్‌, పూజా హెగ్డే జంటగా రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం రాధేశ్యామ్‌. ఈ నెల 11న థియేటర్లలో విడుదలైంది. త్వరలోనే ఓటిటీలోకి విడుదల కానుంది.
 
ఓటిటీ అమెజాన్‌ భారీ ధర పెట్టి సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఏప్రిల్‌ 2న ఉగాది కానుకగా ఈ సినిమాను స్ట్రీమింగ్‌ కావొచ్చని భావిస్తున్నారు.
 
ఇకపోతే.. ప్రభాస్ హీరోగా రాధా కృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన రాధే శ్యామ్ మార్చి 11న విడుదలై మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకుంది. 
 
యు.వి. క్రియేషన్స్ బ్యానర్‌పై భూషణ్ కుమార్, వంశీ-ప్రమోద్ నిర్మించిన ఈ చిత్రం పాన్ ఇండియా మూవీగా తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మళయాలం భాషల్లో విడుదలైంది. 
 
అయితే.. కలెక్షన్ల పరంగా మాత్రం దూసుకుపోతోంది. తొలి రెండు రోజుల్లో 119 కోట్లు వసూలు చేసిన రాధేశ్యామ్.. మూడు రోజుల్లో 151 కోట్లు రాబట్టింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు