రజినీకి గాయాలయ్యాయి అనే వార్తతో ఆయన అభిమానులు కంగారు పడిపోయారు. అయితే, భయపడాల్సిన పనేంలేదనీ, గాయం చిన్నదేనని చిత్రబృందం క్లారిటీ ఇవ్వడంతో వారంతా ఊపిరి పీల్చుకున్నారు.
కాగా, శంకర్ దర్శకత్వంలో రోబో సీక్వెల్గా తెరకెక్కుతోన్న '2.O'లో రజినీకాంత్ హీరోగా, బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ విలన్గా నటిస్తున్నారు. దాదాపు రూ.400 కోట్లతో '2.O' తెరకెక్కుతోంది. ఈ చిత్రాన్ని వచ్చే యేడాది దీపావళికి ప్రేక్షకుల ముందుకు రానుంది.