మీరు పార్టీ పెడితేనే మీ వెంట నడుస్తాం.. రజనీకి షాకిచ్చిన అభిమాన సంఘాలు

సోమవారం, 30 నవంబరు 2020 (12:28 IST)
సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌ దిమ్మ దిరిగే షాక్‌ ఇచ్చాయి ఆయన అభిమాన సంఘాలు. రజినీకాంత్ రాజకీయరంగ ప్రవేశంపై కీలక ప్రకటన చేయబోతున్నారు. చాలాకాలంగా రజినీకాంత్ రాజకీయాలలోకి ఎంట్రీపై అనేక కథనాలు వెలువడ్డాయి. 2019 లోనే రాజకీయాల్లోకి వస్తారని అనుకున్నారు. కానీ, రాజకీయాల్లోకి రావటానికి ఇంకా సమయం ఉందని, త్వరలోనే అన్ని విషయాలు చెప్తానని గతంలో పేర్కొన్నారు.
 
అయితే.. ఈరోజు ఉదయం అభిమాన సంఘాలతో సమావేశం అయ్యారు రజినీకాంత్‌. ఈ సమావేశంలో రజినీకాంత్‌ ఊహించని అనుభవం ఎదురైంది. ఈ సమావేశంలో బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా అభిమాన సంఘాలు నినాదాలు చేశాయి. 
 
''మీరు పార్టీ పెడితేనే మీ వెంట నడుస్తాం"అని తేల్చి చెప్పేశారు అభిమాన సంఘాల నేతలు. బీజేపీకి మద్దతు ఇస్తే మేము మీ వెంట నడువలేమంటూ స్పష్టం చేశాయి అభిమాన సంఘాలు. అభిమాన సంఘాల తీరుతో షాక్‌ తిన్న రజినీకాంత్‌.. వారిని బుజ్జగించే పనిలో ఉన్నారు. దీంతో మళ్లీ తన రాజకీయ ప్రకటనను వాయదా వేసే అవకాశం వుంది. జనవరిలోనే రజనీకాంత్ కొత్త పార్టీపై ప్రకటన చేసే ఛాన్సుందని టాక్ వస్తోంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు