నిర్మాత 'దిల్' రాజుతో రకుల్ ''దాగుడు మూతలు''

శనివారం, 16 డిశెంబరు 2017 (13:49 IST)
టాలీవుడ్ హీరోయిన్లలో రకుల్ ప్రీత్ సింగ్ ఒకరు. ఈమె ప్రస్తుతం టాలీవుడ్ అగ్ర నిర్మాతల్లో ఒకరైన 'దిల్' రాజుతో దాగుడు మూతలు ఆడుతున్నట్టు ఫిల్మ్ నగర్‌లో ఓ వార్త హల్‌చల్ చేస్తోంది. సాధారణంగా ఒక హీరోయిన్ దిల్ రాజు సారథ్యంలోని నిర్మాణ సంస్థలో పని చేసేందుకు ఇష్టపడతారు. నిర్మాత నుంచి ఆఫర్ వచ్చిందంటే వెనుకాముందు ఆలోచన చేయకుండా ఒప్పేసుకుంటారు. కానీ, రకుల్ మాత్రం దిల్ రాజుతో 'దాగుడు మూతలు' ఆడుతోందట.
 
మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ - దిల్ రాజుల కాంబినేషన్‌లో ఓ చిత్రం రానుంది. ఇందులో నితిన్, శర్వానంద్‌లు హీరోలుగా నటిస్తున్నారు. అంటే యువ మల్టీస్టారర్ చిత్రమన్నమాట. ఇందులో ఒక హీరోయిన్‌గా సాయి పల్లవిని ఎంపిక చేస్తే మరో హీరోయిన్‌గా రకుల్ ప్రీత్ సింగ్‌ను ఎంపిక చేసేందుకు ఆమెను సంప్రదించారట. 
 
తొలుత ఆమె ఓకే అన్నట్టుగా ప్రచారం జరిగింది గానీ, ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదట. హరీశ్ శంకర్ కి 'ఎస్' అని గానీ .. 'నో' అని గాని చెప్పకుండా ఆయనతో ఆమె 'దాగుడుమూతలు' ఆడుతోందని కొందరు జోక్ చేస్తున్నారు కూడా. 
 
కాగా, దిల్ రాజు - హరీష్ శంకర్ కాంబినేషన్‌లో గతంలో జూనియర్ ఎన్టీఆర్ 'రామయ్యా వస్తావయ్యా', సాయిధరమ్ తేజ్ 'సుబ్రమణ్యం ఫర్ సేల్', అల్లు అర్జున్ 'దువ్వాడ జగన్నాథం' చిత్రాలు వచ్చాయి. ఈ మూడు చిత్రాలు మంచి విజయాన్ని అందుకున్నాయి. ఇపుడు మరోమారు ఇదే కాంబినేషన్‌ రిపీట్ కానుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు