వచ్చే దీపావళికి ఎన్టీఆర్ ఆత్మ అంటించే బాంబు పేలుతుంది : వర్మ ట్వీట్

గురువారం, 19 అక్టోబరు 2017 (14:07 IST)
వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ దీపావళి బాంబు పేల్చారు. దేశ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూనే ఆటంబాంబు పేల్చారు. ఈ మేరకు ఆయన గురువారం తన ట్వట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ చేశారు. "ఎన్టీఆర్స్ లక్ష్మి బాంబ్... ఈ దీపావళి సంగతి సరే కాని వచ్చే దీపావళిలో మాత్రం ఎన్టీఆర్‌గారి ఆత్మ అంటించే చాలా చాలా లక్ష్మి బాంబులు పేలబోతున్నాయి. హ్యాపీ నెక్స్ట్ ఇయర్స్ దివాలి" అంటూ పోస్టు చేశాడు. 
 
కాగా, 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా తీస్తున్నానని రాంగోపాల్ వర్మ ప్రకటించిన నాటి నుంచి టీడీపీ నేతలుపలు హెచ్చరికలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వారందరి హెచ్చరికలకు వర్మ తీరిగ్గా సమాధానాలు చెబుతున్నారు. సీఎం చంద్రబాబునాయుడు సూచనల నేపథ్యంలో టీడీపీ నేతలు ఎలాంటి వ్యాఖ్యలు చేయని నేపథ్యంలో... దీపావళిని పురస్కరించుకుని వర్మ ఫేస్‌బుక్‌లో తాజాగా ఒక పోస్టు చేసి మరో చర్చకు దారితీశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు