రాంగోపాల్ వర్మ నన్ను మోసం చేసాడు, ఆ అశ్లీల వీడియోలో నన్ను నా డ్రైవర్ గుర్తించాడు: రాధికా ఆప్టె

శనివారం, 22 మే 2021 (14:52 IST)
రాధికా ఆప్టే. ఈమె గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బోల్డ్ క్యారెక్టర్లలో నటించడానికి సై అనే తారల్లో ఈమె కూడా ఒకరు. 2015లో ఆమె నటించిన పార్చ్‌డ్ అనే చిత్రంలో మహిళలు ఎదుర్కొనే పాత్రలో ఆమె నటించింది. ఐతే ఈ చిత్రం థియేటర్లో విడుదలకు ముందే టోరెంటో ఫిలిమ్ ఫెస్టివల్లో ప్రదర్శితమైంది. దాంట్లో ఆమె నటించిన కొన్ని అశ్లీల సన్నివేశాలు ఆన్లైన్లో లీక్ అయ్యాయి.
 
అప్పట్లో అవి విపరీతంగా వైరల్ అయ్యాయి. దీనిపై రాధికా ఆప్టె ఇటీవల స్పందిస్తూ.. ఆ అశ్లీల చిత్రంలో తనను తన డ్రైవర్, వాచ్ మెన్ ఇలా తన వద్ద పనిచేసేవారంతూ గుర్తుపట్టారనీ, దాంతో వారం పాటు ఇంట్లో నుంచి బయటకు రాలేదని ఆమె వెల్లడించారు. అంతేకాదు.. రాంగోపాల్ వర్మ తనను మోసం చేశారని ఆరోపించారు.
 
రక్తచరిత్ర చిత్రం తీసేటపుడు తనను కేవలం తెలుగు వెర్షన్లో మాత్రమే నటించాల్సి వుంటుందని చెప్పి, తమిళంలోనూ వాడుకున్నాడు. కానీ తనకు మాత్రం కేవలం తెలుగులో నటించినందుకు పారితోషికం ఇచ్చారంటూ రాధికా ఆప్టే చెప్పారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు