పిల్లలు కాలేజీకి వెళ్లాక.. వ్యవసాయం చేసుకుంటా.. రేణు దేశాయ్

సోమవారం, 30 మార్చి 2020 (20:05 IST)
పల్లె వాతావరణాన్ని దగ్గర నుంచి చూశానని.. ఎప్పటికైనా వ్యవసాయం చేయాలని నిర్ణయించుకున్నానని సినీ హీరోయిన్ రేణు దేశాయ్ వెల్లడించింది. ఎప్పటికైనా వ్యవసాయం చేయాలని నిర్ణయించుకున్నానని.. తన పిల్లలు కాలేజీకి వెళ్లడం ప్రారంభించిన తర్వాత.. ఏదో ఒక గ్రామానికి వెళ్లి వ్యవసాయం చేస్తానని రేణూ దేశాయ్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. పేద పిల్లలకు పుస్తకాలు కొనివ్వడంతో పాటు పది పిల్లులు, కుక్కులను పెంచాలని ఉంది. ఆ రోజు త్వరలోనే వస్తుందని రేణు తెలిపింది. 
 
హీరోయిన్ రేణూదేశాయ్.. పవన్ కల్యాణ్‌తో విడిపోయి మరో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె కుటుంబ సభ్యులతో కలిసి పుణేలో ఉంటున్నారు. బాలీవుడ్‌లో పలు సినిమాలు నిర్మిస్తూ.. దర్శకత్వం కూడా వహిస్తున్నారు. తాజాగా ఆమె మరాఠీలో ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. 
 
కరోనా లాక్‌డౌన్‌కు ముందు ఈ చిత్రం షూటింగ్‌ను వికారాబాద్‌లో చిత్రీకరించారు. అక్కడి పరిసరాల్లో కొన్ని సన్నివేశాలను షూట్ చేశారు. ఆ సమయంలో రేణూ దేశాయ్ అక్కడి గ్రామాలను చుట్టేశారు. స్థానిక పిల్లలతో కలిసి సందడి చేశారు. ఈ సందర్భంగా తీసిన ఫోటోలను ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు