2024 ఎన్నికల్లో ఓటమి.. మళ్లీ జబర్దస్త్ షోకు ఆర్కే రోజా?

సెల్వి

బుధవారం, 5 జూన్ 2024 (19:15 IST)
జబర్దస్త్, తెలుగు స్కెచ్ కామెడీ టెలివిజన్ సిరీస్‌ను మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్ రూపొందిస్తోంది. ఈ షోకు మొదట్లో సంజీవ్ కె కుమార్ దర్శకత్వం వహించారు. తరువాత అతని సహచరులు నితిన్, భరత్ దర్శకత్వం వహించారు. 
 
ఈ కార్యక్రమం ఫిబ్రవరి 7, 2013న ఈటీవీలో ప్రారంభమైంది. ఈ షోకు నటి, రాజకీయ నాయకురాలు రోజా ప్రారంభం నుండి 2022 వరకు న్యాయనిర్ణేతగా పని చేశారు. రోజా-నాగబాబు కాంబో బాగా పాపులర్ అయ్యింది. ఇంకా సక్సెస్ కూడా అయ్యింది. 
 
జబర్దస్త్‌లో హాస్యనటులతో ఆమె ప్రశంసలు అందుకుంది. ఆమె చమత్కారమైన సమాధానాలు, పంచ్ డైలాగులు అదిరిపోయేవి. ఆమె ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో కూడా జబర్దస్త్‌లో ఆమె పాల్గొనడం భారీ హైప్‌ను ఆ షోకు సంపాదించి పెట్టింది. 
 
కానీ మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో వివాదాల నేపథ్యంలో, నాగబాబు జబర్దస్త్ నుండి వైదొలిగారు. ఆయన స్థానంలో గాయకుడు మనో, రోజాతో పాటు జబర్దస్త్‌లో చాలా కాలం పాటు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. అయితే రోజాకు మంత్రి పదవి రావడంతో ఆమె కూడా జబర్దస్త్‌కు వీడ్కోలు పలికింది.
 
రోజా నిష్క్రమణ తర్వాత, నటి ఇంద్రజ షోలో తన స్థానంలో కొనసాగుతోంది. నటుడు కృష్ణ భగవాన్ ఇప్పుడు జబర్దస్త్‌లో న్యాయనిర్ణేతలలో ఒకరిగా ఇంద్రజతో చేరారు. అదనంగా, ఖుష్భూ షోలో అతిథి న్యాయనిర్ణేతగా కూడా కనిపించింది.
 
ఈ నేపథ్యంలో 2024 సార్వత్రిక ఎన్నికలలో ఆమె ఓటమి తరువాత, రోజా తిరిగి జబర్దస్త్‌లో చేరవచ్చని పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. ఈ ఊహాగానాలు రియాలిటీగా మారితే జబర్దస్త్ షో రేటింగ్ పరంగా దూసుకుపోయే ఆస్కారం వుంది. 
 
అనసూయ భరద్వాజ్ హోస్ట్‌గా వ్యవహరించిన ఈ షోకి ఇప్పుడు సిరి హనుమంత్ నాయకత్వం వహిస్తున్నారు. జడ్జిలుగా జానీ, శేఖర్ గెస్ట్ అప్పియరెన్స్‌లు ఇచ్చారు. 2014లో ఎక్స్‌ట్రా జబర్దస్త్ అనే ఎక్స్‌టెండెడ్ వెర్షన్ ప్రారంభమైంది. మరి ఈ షోకు మళ్లీ రోజా జడ్జిగా మారే అవకాశం వున్నట్లు తెలుస్తోంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు