హైబ్రిడ్ పిల్లకు లక్కీ ఛాన్స్..?

శనివారం, 1 జూన్ 2019 (11:21 IST)
'బాహుబలి' చిత్రం తర్వాత దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం "ఆర్ఆర్ఆర్". ఇందులో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు హీరోలుగా నటిస్తుంటే, డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇందులో హీరోయిన్‌గా అలియా భట్‌ (చెర్రీ కోసం)ను ఎంపిక చేశారు. జూనియర్ ఎన్టీఆర్ కోసం ఎంపిక చేసిన బ్రిటన్ బ్యూటీ డైసీ ఎడ్గర్ జోన్స్‌ ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకుంది. 
 
దీంతో ఎన్టీఆర్ సరసన ఎవరు నటిస్తారు అనే దానిపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. మలయాళ బ్యూటీ నిత్యామీనన్ ఎంపిక అయిందని ఆ మధ్య వార్తలు రాగా.. లేదు విదేశీ భామనే ఎంపిక చేస్తారని టాక్ వచ్చింది.
 
కానీ తాజా సమాచారం ప్రకారం మలయాళ కుట్టి సాయి పల్లవి.. ఎన్టీఆర్ సరసన హీరోయిన్‌గా నటించనుందని సమాచారం. ఇటీవ‌లే "ఆర్ఆర్ఆర్" టీం సాయి ప‌ల్ల‌విని సంప్ర‌దించ‌గా, ఆమె బ‌ల్క్ డేట్స్ కూడా ఇచ్చిందని తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అటు చరణ్, ఎన్టీఆర్ గాయాల బారిన పడడం వల్ల చిత్ర షూటింగ్‌కు కొన్ని రోజులు బ్రేక్ పడిన సంగతి తెలిసిందే.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు