భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్ నటీనటులంతా భారత్కు రావాలని ఆయన పిలుపునిచ్చారు. ముఖ్యంగా పాక్ నటీనటులు తీవ్రవాదులు కాదన్నారు.
యూరీ ఘటనకు పాల్పడింది ఉగ్రవాదులే.. కానీ నటీనటులు కాదన్నారు. పాక్ ఆర్టిస్టులు ఉగ్రవాదులు కాదన్నారు. నటీనటులు, ఉగ్రవాదులు వేర్వేరు అని ఆయన చెప్పుకొచ్చారు. సరైన వీసా వర్క్ పర్మిట్తో భారత్కు రావాలని పిలుపునిచ్చాడు. ఎంతో మంది పాక్ కళాకారులకు ఇక్కడ నివసించడానికి వాలిడ్ వీసా ఉందని గుర్తుచేశారు. అదేసమయంలో భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య శాంతి వాతావరణం నెలకొనాలన్నారు.
పాక్ సైనికులు, కళాకారులకు సంఘీభావంగా ఈ చర్య తీసుకున్నట్టు తెలిపింది. భారతీయ సినిమాల ప్రదర్శనపై నిషేధం నిరవధికంగా కొనసాగుతుందని తెలిపింది. సూపన్ సినిమా అనేది పాకిస్థాన్లో పెద్ద సినిమా ఆపరేటర్లలో ఒకటి. ఇక, భారతీయ సినిమాల ప్రదర్శన నిలిపివేస్తున్నట్టు కరాచీలోని నూప్లెక్స్ సినిమా ఆపరేటర్ కూడా ఫేస్బుక్లో పోస్ట్ చేసింది.