సమంతతో సినిమా చేస్తున్నాను.. కారులో కలిసి వెళ్తున్నాం ఫోటో చూడండి: చైతూ

శనివారం, 17 మార్చి 2018 (15:23 IST)
''ఏ మాయ చేసావె'' సినిమాతో తెరంగేట్రం చేసిన జంట సమంత, నాగచైతన్య. ఈ ప్రేమ జంట రియల్ లైఫ్‌లో భార్యాభర్తలుగా మారిపోయింది. పెళ్లితో ఏకమైన ఈ జంట.. త్వరలోనే వెండితెరపై కనిపించనుంది. పెళ్లికి ముందు ఆటో నగర్ సూర్య, మనం వంటి సినిమాల్లో కలిసి నటించిన ఈ జంట.. పెళ్లికి తర్వాత కూడా స్క్రీన్‌పై కనిపించనుంది.  
 
నిన్ను కోరి డైరెక్టర్ శివ నిర్వాణ డైరెక్షన్‌లో తెరకెక్కనున్న సినిమాలో సామ్, చైతు జంట కలిసి నటించనుంది. ఈ సినిమాకు ''ప్రేయసి'' అనే టైటిల్‌ని చిత్ర యూనిట్ ఖరారు చేసినట్లు ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగింది.
 
ఈ నేపథ్యంలో నాగచైతన్య ప్రస్తుతం చందూ మొండేటి దర్శకత్వంలో ''సవ్యసాచి'' సినిమా చేస్తున్నాడు. ఇక మారుతి దర్శకత్వంలో ''శైలజా రెడ్డి అల్లుడు'' సినిమా చేస్తున్నాడు. ఈ రెండూ కూడా డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్నాయి. తాజాగా శివ నిర్వాణతో మరో సినిమా చేయడానికి చైతూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ఈ చిత్రంలో హీరోయిన్ సమంతానేనని చైతూ ట్వీట్ కూడా చేశాడు. 
 
శనివారం ఈ సినిమా పనులు కూడా ప్రారంభమయ్యాయి. 'ఈరోజు కచ్చితంగా కొత్త రోజని.. చాలా కొత్తరోజని.. సమంతతో కలిసి వర్క్ చేసేందుకు వెళ్తున్నానని' సమంతతో కలిసి కారులో వెళ్తోన్న సెల్ఫీని చైతూ ట్విట్టర్లో పోస్టు చేశాడు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు