మళ్లీ కెమెరా ముందుకు శృతిహాసన్

సోమవారం, 22 ఏప్రియల్ 2019 (16:48 IST)
విశ్వనటుడు కమల్ హాసన్ ముద్దుల కుమార్తె శృతిహాసన్. న‌టిగా, సింగ‌ర్‌గా, ఆర్టిస్ట్‌గా ఇలా ఎన్నో విభాగాల‌లో త‌న ప్ర‌తిభ క‌న‌బ‌రుస్తూ, సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకుంది. పైగా, తండ్రికి తగ్గ తనయగా పేరుగడించింది. అటు తెలుగు, తమిళ, హిందీ చిత్రాల్లో ఓ వెలుగు వెలిగింది. 
 
ఈ అమ్మడు నటించిన చిత్రాలు విడుదలై చాలా రోజులైంది. దీంతో అభిమానులు ఆమె సినిమాల కోసం ఆశ‌గా ఎదురు చూస్తున్నారు. ఆ మ‌ధ్య "శ‌భాష్ నాయుడు" అనే చిత్రంలో క‌మల్‌తో క‌లిసి శృతి న‌టించింది. కాని ఈ సినిమా ఇప్ప‌ట్లో విడుద‌ల‌య్యేలా క‌నిపించ‌డం లేదు. 
 
అయితే తాజాగా "సూప‌ర్ డీల‌క్స్" అనే చిత్రంతో మంచి హిట్ కొట్టిన విజ‌య్ సేతుప‌తి స‌ర‌స‌న శృతిహాసన్ నటించనుంది. ఎస్‌పీ జ‌న‌నాథ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం తెర‌కెక్క‌నుంది. "లాభం" అనే టైటిల్‌తో తెర‌కెక్క‌నున్న ఈ చిత్రం రీసెంట్‌గా పూజా కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంది. మ‌రి కొద్ది రోజుల‌లో సెట్స్‌పైకి వెళ్ళ‌నుంది. దేశంలో రైతులు ప‌డుతున్న క‌ష్టాల ఇతివృత్తంతో ఈ చిత్రం తెరకెక్కనుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు