సర్కారు వారి పాట నుండి సెకండ్ సింగిల్ పెన్నీలో సితార

శనివారం, 19 మార్చి 2022 (16:05 IST)
Sitara
పరశురామ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ సర్కారు వారి పాట  నుండి వస్తున్న ప్రతి ఒక్క అప్‌డేట్‌తో అంచనాలను పెంచుతోంది. మొదటిగా, టీజర్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది, ఇందులో మొదటి సింగిల్ ఇప్పటికీ మ్యూజిక్ చార్ట్‌లలో అగ్రస్థానంలో ఉంది. ముందుగా తెలిపినట్లుగా, రెండవ సింగిల్ పెన్నీ మార్చి 20న విడుదల అవుతుంది. అభిమానులను ఆనందపరుస్తూ, పాట ప్రోమోను విడుదల చేశారు.

 
ఇది  రెగ్యులర్ ప్రోమో కాదు, ఎందుకంటే ఇందులో మహేష్ బాబు కుమార్తె ప్రిన్సెస్ సితార ఘట్టమనేని కూడా ఉన్నారు. సితార మ్యూజిక్ వీడియోలో కనిపించడం ఇదే తొలిసారి. మహేష్ బాబు స్టైలిష్, సితార క్యూట్ ట్రెండీ నృత్యరీతులతో మంత్రముగ్ధులను చేస్తుంది. ఆమె డాన్స్ తో పాటు మహేష్ బాబు కూడా కనిపించడం అభిమానులకు పండగలా ఉంటుంది.

 
ఇది కేవలం ప్రోమో మాత్రమే. పూర్తి పాటలో సితార అద్భుతమైన డాన్స్ తో అంచనాలు పెంచనుంది. పూర్తి పాట రేపు మేకర్స్ విడుదల చేయనున్నారు. ఇది వెండితెరపై అభిమానులకు ఫీస్ట్ లా ఉంటుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. సినిమా నిర్మాణ పనులు తుదిదశకు చేరుకున్నాయి. థమన్ చక్కటి బాణీలు అందించాడు. రెండవ పాట మరింత ఆసక్తి కలిగిస్తుంది.

 
మైత్రీ మూవీ మేకర్స్, GMB ఎంటర్‌టైన్‌మెంట్ మరియు 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌లపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట మరియు గోపీచంద్ ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తోంది. ఆర్ మధి సినిమాటోగ్రఫీని నిర్వహిస్తుండగా, మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటర్‌గా, ఎఎస్ ప్రకాష్ ఆర్ట్ డిపార్ట్‌మెంట్‌ను చూసుకుంటున్నారు. సర్కార వారి పాట మే 12న వేసవి ఆకర్షణగా రాబోతోంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు