స్టేజ్ నుంచి పడిపోయిన ప్రియాంక మోహన్.. ఏం జరిగింది? (video)

సెల్వి

గురువారం, 3 అక్టోబరు 2024 (18:16 IST)
హీరోయిన్‌ ప్రియాంక మోహన్‌ ప్రమాదం తృటిలో తప్పింది. తెలంగాణలో జరిగిన ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి వచ్చిన ఆమెకు షాక్ తప్పలేదు. వివరాల్లోకి వెళితే.. మహబూబాబాద్‌ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలోని కాసం షాపింగ్‌ మాల్‌ ప్రారంభోత్సవానికి హీరోయిన్‌ ప్రియాంక మోహన్‌, పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీ ఇన్చార్జ్‌ హనుమాండ్ల ఝాన్సీ రెడ్డి విచ్చేశారు. 
 
హీరోయిన్‌ చేతుల మీదుగా షోరూంని ప్రారంభించారు. అనంతరం స్టేజ్‌‌పై నిల్చుని ప్రజలతో మాట్లాడుతుండగా వున్నట్టుండి ప్రమాదం జరిగింది. హీరోయిన్‌ను చూసేందుకు వేదికపైకి ఎక్కువమంది ఎక్కడంతో ఒక్కసారిగా స్టేజి కుప్పకూలింది. దీంతో స్టేజిపై ఉన్న వారంతా కింద పడిపోయారు. ఒకరిపై ఒకరు పడిపోవడంతో పలువురికి గాయాలయ్యాయి. 
 

Priyanka Mohan Faced a Terrible Stage Accident!

She was in Torrur, #Telangana, to inaugurate Kasam Shopping Mall, where 3 people were injured due to a stage collapse, including Congress leader Jhansi Reddy

#PriyankaMohan was unharmed#Tollywood #Congress #Brother #JayamRavi pic.twitter.com/k3g6SzUZuB

— Pakka Telugu Media (@pakkatelugunewz) October 3, 2024
ఈ ప్రమాదంలో గాయపడ్డ పాలకుర్తి కాంగ్రెస్‌ పార్టీ ఇన్చార్జి ఝాన్సీ రెడ్డిని ఆసుపత్రికి తరలించారు. హీరోయిన్‌ ప్రియాంక కింద పడిపోయినప్పటికీ ఎటువంటి గాయాలు కాలేదు. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
 
ఈ ప్రమాదంపై ప్రియాంక మోహన్ మాట్లాడుతూ.. ఈ ప్రమాదం నుంచి తేలికపాటి గాయాలతో బయటపడ్డానని చెప్పింది. తన ఆరోగ్యంపై ఆరా తీసిన అభిమానులకు ధన్యవాదాలు. ఈ ఘటనలో గాయపడిన వారు త్వరలో కోలుకోవాలని ప్రియాంక మోహన్ ఆకాంక్షించారు. 

Priyanka Mohan Faced a Terrible Stage Accident!
Three people's were injured ????#PriyankaMohan#Telangana pic.twitter.com/2szEGuypOZ

— P A B L O (@DhaVan_07) October 3, 2024

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు