సుమంత్ 25వ సినిమా సుబ్రహ్మణ్యపురం ట్రైలర్ రిలీజ్

శనివారం, 20 అక్టోబరు 2018 (10:57 IST)
సంతోష్ జాగ‌ర్ల‌పూడి ద‌ర్శ‌క‌త్వంలో సుమంత్ త‌న 25వ చిత్రం సుబ్ర‌హ్మ‌ణ్య‌పురం తెరకెక్కుతోంది. సుధాకర్ ఇంపెక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై బీరం సుధాకర్‌రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈషా రెబ్బ క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ సినిమా వాస్త‌విక మేళ‌వింపుల‌తో మిస్ట‌రీ థ్రిల్ల‌ర్‌గా సాగుతుంది.


భక్తుల్ని అనుగ్రహించి వారి కోరికలు తీర్చాల్సిన దేవుడే ఆగ్రహించడానికి కారణమేమిటి? దేవుడిపై నమ్మకంలేని ఓ నాస్తికుడు దైవసంకల్పంతో తన లక్ష్యాన్ని ఎలా చేరుకున్నాడనే అంశంపై ఈ సినిమా తెరకెక్కిందని నిర్మాతలు చెప్తున్నారు. 
 
తాజాగా చిత్ర టీజ‌ర్ విడుద‌ల చేశారు. టీజ‌ర్‌ని బ‌ట్టి చూస్తుంటే సుమంత్ నాస్తికుడిగా, దేవాలయాల మీద పరిశోధన చేసే పాత్రలో నటిస్తున్నాడని తెలుస్తుంది. ఆస‌క్తిక‌ర కాన్సెప్ట్‌తో తెర‌కెక్కుతున్న ఈ చిత్రం వ‌చ్చే నెల‌లో విడుద‌ల కానుంది.

శేఖర్ చంద్ర సంగీతం అందించిన ఈ సినిమాలో తనికెళ్ల భరణి, సాయికుమార్, అలీ, సురేష్, మాధవి, హర్షిణి, టీఎన్‌ఆర్ తదితరులు న‌టిస్తున్నారు. తాజాగా విడుదలైన టీజర్‌ను ఓ లుక్కేయండి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు