పూరీ జగన్నాథ్ రోగ్ ఆడియో లాంచ్.. ఇరగదీసిన సన్నీ లియోన్ (Video)

మంగళవారం, 14 మార్చి 2017 (09:50 IST)
ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్ర ‘రోగ్’. ఈ చిత్రం ఆడియో రిలీజ్ కార్యక్రమం హైదరాబాద్‌లో సోమవారం రాత్రి జదిగింది. కొత్త హీరో ఇషాన్‌ను సినీ ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్న ఈ చిత్రంలో ఆయన సరసన మన్నారా చోప్రా, ఏంజెలినా నటిస్తున్నారు. 
 
ఈ కార్యక్రమానికి దర్శకుడు పూరీ జగన్నాథ్, హీరో ఇషాన్, నటుడు సుబ్బరాజు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా బాలీవుడ్ బ్యూటీ సన్నీ లియోన్ స్టేజ్‌పై ప్రదర్శన అదరగొట్టింది. తన డ్యాన్స్ ట్రూప్‌తో అదరగొట్టే  స్టెప్పులేస్తూ, ఈ కార్యక్రమానికి హాజరైన వారిని ఉత్సాహపరుస్తూ తన ప్రదర్శన కొనసాగించింది.

వెబ్దునియా పై చదవండి