తమిళనాట వర్షాలు బీభత్సం సృష్టించి ప్రజల్ని అతలాకుతలం చేస్తుంటే... ప్రముఖులు తోచిన సాయం చేస్తున్నారు. ఇప్పుడు విశాల్ తర్వాత సూర్య అటువంటి కార్యక్రమాలు చేపడుతున్నారు. తాజాగా ఆయన తమిళనాడు సీఎం రిలీఫ్ ఫండ్కు రూ. 25 లక్షలను విరాళంగా ఇచ్చి దాతృత్వాన్ని చాటుకున్నారు. ఇక ఈ వరదల వల్ల ఇబ్బందులకు గురైన ప్రజల సహాయార్థం ప్రభుత్వంతో పాటు పలు ఇతర స్వచ్చంద సంస్థలు కూడా సహాయ చర్యల్లో లీనమయ్యాయి.