పవన్ కల్యాణ్ స్పీచ్: షూటింగ్ ఆపేసి చూసిన చిరంజీవి.. తమ్ముడు మాత్రం?

సోమవారం, 29 ఆగస్టు 2016 (13:21 IST)
ఆంధ్రప్రదేశ్‌కు స్పెషల్ స్టేటస్, ఫ్యాన్స్ గొడవ, జనసేన పార్టీ ఆవిర్భావం వంటి అంశాలపై తిరుపతిలో ఏర్పాటైన బహిరంగ సభలో జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ మాట్లాడిన సంగతి తెలిసిందే. ఫ్యాన్స్ మధ్య జరిగిన గొడవ హత్యకు దారితీసిన నేపథ్యంలో జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ శనివారం బహిరంగ సభలో మాట్లాడుతూ.. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలను ఏకిపారేశారు. అలాగే ఎంపీలపై కూడా సీరియస్ అయ్యారు.

పవన్ స్పీచ్‌ను ఆద్యంతం చాలామంది టీవీలో ఆసక్తిగా వీక్షించారు. ఇదే తరహాలో మెగాస్టార్ అన్నయ్య చిరంజీవి కూడా తమ్ముడు ప్రసంగాన్ని విన్నారు. 
 
చిరంజీవి ప్రస్తుతం తన 150వ సినిమా షూటింగ్‌లో చాలా బిజీగా గడుపుతున్నప్పటికీ.. పవన్ స్పీచ్‌ ప్రారంభం కాగానే చిరంజీవి షూటింగ్‌ను ఆపేశారు. షూటింగ్ మధ్యలో ఆపేయించి అక్కడే ఓ టీవీని ఏర్పాటు చేయించుకుని తమ్ముడు మాట్లాడిన స్పీచ్ లైవ్ మొత్తం ఆసక్తిగా వీక్షించారట.

స్పీచ్ అయిపోగానే ఎవరితో ఏమి మాట్లాడకుండా మళ్లీ షూటింగ్ కొనసాగించినట్లు తెలిసింది. కాగా మెగాఫామిలీలో జరిగే ఎలాంటి కార్యక్రమాలకు సమయం కేటాయించని పవన్ కళ్యాణ్ కోసం అన్నయ్య చిరంజీవి షూటింగ్‌లో ఉన్నా ప్రత్యక్షంగా తమ్ముడి స్పీచ్‌ను చూడటం గొప్ప విషయమని సినీ పండితులు అంటున్నారు.

వెబ్దునియా పై చదవండి