కాంటినెంటల్ ఆసుపత్రి వైద్యసిబ్బందికి కృతజ్ఞతలు తెలిపిన తమన్నా

శనివారం, 17 అక్టోబరు 2020 (16:50 IST)
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్నా కరోనావైరస్ బారిన పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హైదరాబాదులో కరోనా చికిత్స పొందిన కాంటినెంటల్ ఆసుపత్రికి ఈ సాయంత్రం వచ్చి వారికి కృతజ్ఞతలు తెలియజేశారు తమన్నా.
 
కాగా ఇటీవల ఎన్నో జాగ్రత్తల మధ్య తమన్నా ఓ వెబ్ సిరీస్‌ షూటింగ్‌లో పాల్గొంది. అక్కడ ఆమెకు కరోనా వైరస్ సోకింది. జ్వ‌రం వ‌స్తుండ‌టంతో టెస్ట్ చేయించుకున్న ఆమెకు క‌రోనా పాజిటివ్‌ అని తేలింది. అయితే ప్ర‌స్తుతం కరోనా నుండి కోలుకుంది.
 
"నేను నా టీం సెట్‌లో చాలా జాగ్ర‌త్త‌లు తీసుకున్నాం. కాని ఎలా సోకిందో అర్థం కావ‌డం లేదు. గ‌త వారం లైట్ ఫీవ‌ర్ ఉండ‌డంతో క‌రోనా టెస్ట్ చేయించుకోగా, పాజిటివ్ అని నిర్ధార‌ణ అయింది. ఈ స‌మస్య నుండి బ‌య‌ట ప‌డేందుకు హైద‌రాబాద్‌లోని ప్రైవేట్ ఆసుప‌త్రిలో వెంట‌నే అడ్మిట్ అయి చికిత్స తీసుకున్నాను. నిపుణులైన వైద్యుల సంరక్షణలో ట్రీట్‌మెంట్‌ అనంతరం.. డాక్టర్ల సలహాతో నేనిప్పుడు డిశ్చార్జ్ అయ్యాను. 
 
ప్ర‌పంచాన్ని వణికిస్తున్న క‌రోనా మ‌హమ్మారి నుండి త్వ‌ర‌గా కోలుకోవ‌డం అదృష్టంగా భావిస్తున్నాను. పూర్తి ఆరోగ్యంతో త్వ‌ర‌లోనే మీ ముందుకు వ‌స్తాను. ప్రస్తుతం వైద్యుల సలహా మేరకు సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉన్నాను. నాకోసం ప్రార్థనలు చేసిన ప్రతి ఒక్కరికీ, అభిమానులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరూ క్షేమంగా, ఆరోగ్యంగా ఉండండి" అంటూ తమన్నా తన ట్విట్టర్ ఖాతాలో విడుదల చేసిన లేఖలో పేర్కొంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు