టాలీవుడ్‌లో నెక్స్ట్ జనరేషన్ నట వారసుల ఎంట్రీలు షురూ!

ఠాగూర్

మంగళవారం, 27 ఆగస్టు 2024 (16:00 IST)
తెలుగు చిత్రపరిశ్రమలో తదుపరి తరం నట వారసుల ఎంట్రీలు ప్రారంభమైపోయాయి. కొంతకాలం క్రితం వరకు హీరోగానే తన వారసులను హీరోలు వెండితెరకు పరిచయం చేసేవారు. కానీ, ఇపుడు మారిన కాలమాన పరిస్థితుల నేపథ్యంలో నేటితరం హీరోలు కుడా తమ పంథాను మార్చుకున్నారు. నేటి ట్రెండ్‌కు అనుగుణంగా తమ పిల్లల వయసుతో పనిలేకుండా వారి వయసుకు తగిన పాత్రలు ఉంటే చాలు సినిమాల్లో నటింపజేసేందుకు ప్రోత్సహిస్తున్నారు. 
 
ఈ క్రమంలో నందమూరి బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ ఎంట్రీ కోసం అభిమానులు ఐదేళ్లుగా ఎదురు చూస్తున్నారు. కానీ సమయం తీసుకుని ఈ  సెప్టెంబరు నెలలో తన తొలి సినిమాను అనౌన్స్ చేయనున్నారు. ప్రశాంత్ వర్మ‌ దర్శకత్వంతో నందమూరి అభిమానులు అంచనాలను రీచ్ అయ్యే పాత్రలో మోక్షజ్ఞ కనిపించనున్నాడు. 
 
ఇక ఇప్పటికే మహేశ్ బాబు కొడుకు గౌతమ్ కృష్ణ బాలనటుడిగా ఓ సినిమాలో నటించగా పూర్తి స్దాయి హీరోగా రావటానికి ఇంకాస్త సమయం పట్టనుంది. మహేష్ కుమార్తె సితార నటికాకముందే సోషల్ మీడియాలో ఫేమస్.. ఆమె వయస్సుకు తగ్గ కథ ఉంటే నటిగా ఎంకరేజ్ చెసెందుకు మహేష్ నమ్రత సిద్దంగానే ఉన్నారు. 
 
అల్లు అర్జున్ కూతురు కూడా 'శాకుంతలం' సినిమాలో నటించి మెప్పించింది. బన్నీ కుమారుడు అయాన్ సైతం‌ ఆర్టిస్ట్ కాకున్నా.. మోడల్ ట్యాగ్‌తో సపరేట్ ఫ్యాన్ బేస్‌ను క్రియేట్ చేస్తుకున్నాడు. హీరో సుధీర్ బాబు తనయులు కూడా బాలనటులుగా రాణిస్తున్నారు. ఇదే క్రమంలో ఇప్పుడు మంచు కుటుంబం‌ నుంచి మూడో తరాన్ని కూడా పరిచయం చేస్తున్నారు. 'కన్నప్ప'లో బాల తిన్నడుగా మంచు అవ్రామ్ ఎంట్రీని రివీల్ చేశారు.
 
వీరేకాక నందమూరి హరికృష్ణ మనవడు జానకీరామ్ కుమారుడు ఎన్టీఆర్‌ను కూడా వైవీఎస్ చౌదరి హీరోగా పరిచయం చేస్తున్నారు.‌ మహేష్ బాబు సోదరుడు రమేష్ బాబు తనయుడైన జయకృష్ణ కూడా నటుడిగా పరిచయం కానున్నాడు. శ్రీకాంత్ కొడుకు రోషన్ హీరోగా వరుస సినిమాలు చెస్తూనే ఉన్నాడు. 
 
రవితేజ కుమారుడు మహాదాన్ కొన్ని సినిమాల్లో నటించారు. రాజశేఖర్, జీవితల కూతురు శివానీ, శివాత్మికలు కూడా సినిమాలు చేస్తూ ఉన్నారు. ఇలా సీనియర్ జూనియర్‌లు అన్న తేడా లేకుండా హీరోలు నటులు తమ పిల్లల యాక్టింగ్ ఇంట్రెస్ట్‌ను వయస్సుతో నిమిత్తం లేకుండా ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు