రకుల్ ప్రీత్ సింగ్కు ప్రస్తుతం యమా క్రేజ్. కుర్ర హీరోల నుంచి స్టార్ హీరోలతో నటించేస్తున్న ఈ భామ ఓ ఆసక్తికరమైన ట్వీట్ చేసింది. ''కేపీహెచ్బీలో నేను కూరగాయలు అమ్ముతా, ఉదయం 10 గంటల నుంచి నా దగ్గరకు వచ్చి కూరగాయలు కొనుక్కోండి'' అంటూ రకుల్ చేసిన ట్వీట్కు సోషల్ మీడియాలో మంచి స్పందన వచ్చింది. చెప్పినట్లుగానే శనివారం ఉదయం కూకట్ పల్లి హౌసింగ్ బోర్డులో మంజీరా మాల్ ఎదురుగా ఉన్న మార్కెట్లో రకుల్ కూరగాయలు అమ్మింది.
ఇలా రకుల్ అమ్మిన కూరగాయల ద్వారా వచ్చిన డబ్బును ఏదైనా సామాజిక సేవా కార్యక్రమం కోసం వినిగయోగిస్తారని తెలిసింది. ఇలా రకుల్ ప్రీత్ సింగే కాదు.. టాలీవుడ్ సెలెబ్రిటీలు కూడా మేము సైతం అంటూ ఏదో ఆసక్తికరమైన పనులు చేస్తూ.. మెరిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రకుల్ ప్రీత్ సింగ్ ఇలా కూరగాయలు అమ్మడంతో వచ్చే నగదును చెన్నై వరద బాధితులకు పంపనుందని తెలిసింది.