ప్ర‌తి మ‌హిళ అలా చేస్తేనే నిజ‌మైన స‌క్సెస్ అయిన‌ట్లుః సాయిప‌ల్ల‌వి కామెంట్‌

మంగళవారం, 28 సెప్టెంబరు 2021 (20:28 IST)
Sai Pallavi
నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా ఫీల్ గుడ్ సినిమాల దర్శకుడు శేఖర్ కమ్ముల రూపొందించిన సినిమా `లవ్ స్టోరి`. విజ‌య‌వంతంగా ప్ర‌ద‌ర్శించ‌బ‌డుతున్న సంద‌ర్భంగా సాయిప‌ల్ల‌వి త‌న మ‌న‌సులోని మాట‌ల‌ను ఆవిష్క‌రించింది. 
 
సాయి పల్లవి మాట్లాడుతూ,  నాగార్జున గారు ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు వస్తారు. ఆయన గురించి అప్పుడు చెప్పాలని అనుకున్నాను. మా తాతయ్య అన్నమయ్య సినిమా ఒక వందసార్లు చూసి ఉంటారు. ఆయనతో పాటు మేమూ చూశాం. ఆ సినిమా చూసినప్పటి నుంచి మీరంటే ఇష్టం, అభిమానం ఏర్పడ్డాయి. అన్నమయ్య సినిమా చూసి తాతయ్య ఏడుస్తుంటే, ఆయన నటిస్తున్నారు తాతయ్య ఏడవకు అన్నాను. కానీ తాతయ్య అన్నారు ఇప్పుడు నటిస్తుండొచ్చు , గానీ గత జన్మలో నాగార్జున యోగి అయి ఉంటారు అన్నారు. అప్పటి నుంచి మీ సినిమాలు టీవీలో వస్తే ఛానెల్ మారుస్తాను. ఎందుకంటే తాతయ్య దృష్టిలో మీరు ఎప్పుడూ అన్నమయ్యే. ఇవాళ కార్యక్రమానికి వచ్చినందుకు మీకు థాంక్స్. 
 
దర్శకుడు శేఖర్ గారు చెప్పినట్లు నైతికంగా మనమంతా కరెక్ట్ గా ఉండాలని టీమ్ మొత్తం పాటించాం. అమ్మాయి తరుపున నిలబడి శేఖర్ గారు ఫైట్ చేశారు. ఈ సినిమా ద్వారా. సినిమా మేకింగ్ లోనూ ఆయన మా కోసమే మాట్లాడేవారు. ఈ సినిమాలో జరిగినట్లు నాకు అయింది అని చెప్పేందుకు అమ్మాయిలకి ఒక ధైర్యాన్ని లవ్ స్టోరి ఇచ్చింది. మ‌హిళలు ఎవ‌రైనా ఇలాంటి స‌మ‌స్య ఎదుర్కొంటే,  సాయిప‌ల్ల‌వి పాత్ర చూశాక బ‌య‌ట ప‌డండి. అమ్మా నాకూ ఇలా జ‌రిగింద‌ని చెప్పి జీవితాన్ని స‌రిచేసుకోండి. అప్పుడే నిజ‌మైన స‌క్సెస్‌. ప్ర‌తి అమ్మాయి త‌ప్ప‌నిస‌రిగా  సినిమా చూడాలి అన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు