శేఖర్ కమ్ముల కథ చెప్పినప్పుడే మరో మాట మాటడకుండా ఒప్పేసుకున్నా. కథ చెప్పగానే ఆ కథ నా చుట్టూనే తిరుగుతుంది. కనుక మరో హీరో వున్నా అతను చివరివరకు వున్నా ఎవరి పాత్ర వారిదే అనిపించింది. సినిమా చేద్దామని ఎప్పటినుంచే శేఖర్ ని అడుగుతున్నా. అది ఇప్పటికి కుదిరింది. మా కుటుంబంలో అందరితోనూ సినిమా చేశాడు శేఖర్ కమ్ముల. ఆ టైంలో నేను అడిగితే మిమ్మల్ని స్టయిలిష్ క్యారెక్టర్ లో చూపించాలనుకుంటున్నానని అన్నారు. అది చాలా సంవత్సరాలు అయింది. కానీ ఇలా కుబేరతో రావడానికి ఇంత టైం పట్టింది. అందుకే మరో సినిమాను ఆయనతో చేయాలనుకుంటున్నాను అని నాగార్జున తెలిపారు.
థనుష్ గురించి చెబుతూ, ఆయన సహజ నటుడు. బెగ్గర్ పాత్రలో ఒదిగిపోయాడు. రష్మిక పాత్రతో జర్నీ సాధారణంగా సాగుతుంది. చివరిలో ఆయన పడే తపన చాలా బాగుంది. ఏ షాట్ వేస్ట్ కాకుండా దర్శకుడు తీయడం చాలా ప్రశంసనీయమని అన్నారు.
శేఖర్ కమ్ముల మాట్లాడుతూ, నేను ఈరోజు చాలా ఎమోషనల్ గా వున్నా. ఏమి మాట్లాడాలో తెలియడంలేదు. కొన్ని పదాలు రావడంలేదు అంటూ ఎమోషనల్ అయ్యారు. కాసేపు మౌనంగా వున్నారు. ఆ తర్వాత మాట్లాడుతూ, ఈ సినిమా బడ్జెట్ చాలా పెరిగింది. దాని గురించి నిర్మాతలు ఏమనుకుంటారో అని అనుకున్నా. చెప్పాలనుకున్న కథ నిడివి ఎక్కువయినా చెప్పాను. వారు అందుకు బడ్జెట్ ఇచ్చారు అన్నారు.