'నాయకి'గా వెండితెరపై ఆకట్టుకున్న చెన్నై చిన్నది త్రిష సినీ రంగంలో అడుగుపెట్టి దశాబ్దకాలం కావొస్తుంది. అయినప్పటికీ ఈ మిస్ చెన్నైకు అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి. ఇటీవల 'నాయకి', 'ధర్మయోగి' చిత్రాలతో ఆకట్టుకున్న త్రిష మరో అయిదు చిత్రాల్లో నటించేందుకు సమ్మతించగా, తాజాగా, మరో కొత్త ప్రాజెక్ట్కు సంతకం చేసిందట.
ఈ సినిమాలో త్రిష ముఖ్య భూమిక పోషిస్తోంది. సుమన్, రాజేంద్ర ప్రసాద్, రమేశ్ తిలక్, మీరా ఘోషల్లు కీలక పాత్రలో నటించనున్నారు. తెలుగు, తమిళంలో ఈ సినిమాని విడుదల చేయడానికి చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది. ఎస్ఎస్.థమన్ ఈ చిత్రంలోని పాటలకు సంగీత బాణీలు సమకూరుస్తున్నారు.