మంత్రి తలసానికి కృతజ్ఞతలు తెలిపిన టీవీ కళాకారులు..!

సోమవారం, 6 జులై 2020 (22:01 IST)
కరోనా మహమ్మారి తో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న TV కళాకారులు 2 వేల మందికి నిత్యావసర వస్తువులు అందజేసి ఆదుకున్న మంత్రి శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు TV ప్రొడ్యూసర్స్ కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు సోమవారం వెస్ట్ మారేడ్ పల్లి లోని నివాసంలో మంత్రి శ్రీనివాస్ యాదవ్‌ను కలిశారు.
 
కరోనా నేపధ్యంలో షూటింగ్ ల సమయంలో భౌతిక దూరం పాటించాలని, తగు జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి వారికి సూచించారు. కరోనా మహమ్మారి అన్ని రంగాలకు పెను సవాల్‌గా మారిందని, స్వయంనియంత్రణతోనే నిర్మూలన సాధ్యమని చెప్పారు. మంత్రిని కలిసిన వారిలో ప్రెసిడెంట్ ప్రసాద్, వినోద్ బాల, ప్రభాకర్, వెంకటేశ్వర్ రావు, DY. చౌదరి, కిరణ్, అశోక్ తదితరులు ఉన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు