ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పైకి ఉప్పెన.. 14వ తేదీ నుంచి స్ట్రీమింగ్

శనివారం, 3 ఏప్రియల్ 2021 (18:59 IST)
అందమైన ప్రేమకథా చిత్రాలలో 'ఉప్పెన' ముందువరుసలో నిలిచింది. సముద్ర తీరప్రాంతంలోని ఓ జాలరి గూడెం చుట్టూ తిరిగే ప్రేమకథ ఇది. సముద్రంపైనే ఆధిపత్యం చెలాయించాలనుకునే ఓ నాయకుడి కూతురు .. ఓ జాలరి కుర్రాడి ప్రేమలో పడుతుంది. బుచ్చిబాబు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో వైష్ణవ్ తేజ్ - కృతి శెట్టి నాయకా నాయికలుగా నటించారు. 
 
విడుదలైన ప్రతి ప్రాంతంలోను ఈ సినిమా విజయవిహారం చేసింది. థియేటర్లను దడదడలాడించిన ఈ సినిమా, ఇప్పుడు ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పైకి రావడానికి సిద్ధమవుతోంది. అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వసూళ్ల వర్షం కురిపించిన ఈ సినిమా ఓటీటీ హక్కులను నెట్ ఫ్లిక్స్ వారు సొంతం చేసుకున్నారు. మే 14వ తేదీ నుంచి ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నట్టు సమాచారం. ఇక ఓటీటీలో ఈ సినిమా ఏ రేంజ్‌లో దూసుకుపోతుందో చూడాలి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు