జగన్ - పవన్ కళ్యాణ్ వీరిద్దరి ఎవరంటే ఇష్టం.. ఊర్వశి రౌతలా

సోమవారం, 31 జులై 2023 (13:25 IST)
బాలీవుడ్ నటి ఊర్వశి రౌతల తాజాగా బ్రో చిత్రంలో ఓ సాంగ్‌‍లో మెరిసారు. ఈ చిత్రం సూపర్ హిట్ కావడంతో పవన్ కల్యాణ్‌పై ట్వీట్‌ పెట్టి వార్తల్లోకెక్కారు. ఇప్పుడు మరోసారి పవన్‌పై నెటిజన్‌ వేసిన ప్రశ్నకు స్పందించింది. ఎప్పుడూ సోషల్‌ మీడియాలో చురుగ్గా ఉండే ఈ నటి.. తాజాగా #Askurvashi హ్యాష్‌ ట్యాగ్‌తో ప్రశ్నలు అడగాలని పేర్కొంది. దీంతో నెటిజన్లు ప్రశ్నల వర్షం కురిపించారు.
 
'జగన్, పవన్‌ కల్యాణ్‌.. వీళ్లిద్దరిలో ఎవరి పేరును ఎంపిక చేస్తారు' అని ఓ అభిమాని అడిగారు. దీనికి సమాధానమిచ్చిన ఊర్వశీ.. 'పవన్‌ కల్యాణ్‌' అంటూ రెండుచేతులు జోడించిన ఎమోజీతో రిప్లై ఇచ్చింది. అయితే, అభిమానులు చాలా ప్రశ్నలు వేసినప్పటికీ ఊర్వశీ దీనికి మాత్రమే స్పందించింది. 'మీకు ఇష్టమైన సినిమా ఏది', 'ప్రస్తుతం ఏం సినిమాలు చేస్తున్నారు', 'మీ అభిమాన క్రికెటర్‌ ఎవరూ'.. ఇలా వందకు పైగా ప్రశ్నలు వేసినా.. ఆమె దేనికీ స్పందించలేదు.  
 
ఇటీవల ఈ హీరోయిన్‌ పవన్‌ కల్యాణ్‌‌ను ఏపీ సీఎం అని వ్యాఖ్యానిస్తూ ట్వీట్‌ చేసి విమర్శలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. 'బ్రో' సినిమాలో గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌తో తెరను పంచుకోవడం ఆనందంగా ఉందని పేర్కొంది. సంబంధిత పోస్ట్‌పై ట్రోల్స్‌ వెల్లువెత్తడంతో.. పవన్‌ పేరు ముందు సీఎం అనే పదాన్ని తొలగించింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు