టీటీడీకి భవ్య సంస్థల అధినేత వి. ఆనందప్రసాద్ కోటి విరాళం

బుధవారం, 7 జులై 2021 (16:32 IST)
Anand prasad family
తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని నిత్యాన్నదానానికి ప్రముఖ పారిశ్రామికవేత్త, సినీ నిర్మాత, భవ్య సంస్థల అధినేత వి. ఆనందప్రసాద్ రూ. కోటి రూపాయలు విరాళంగా ఇచ్చారు. నేడు (జూలై 7, బుధవారం) తిరుమలలో అడిషనల్ ఈవో శ్రీ ధర్మారెడ్డిని కలిసిన ఆనందప్రసాద్, కృష్ణకుమారి దంపతులు కోటి రూపాయల చెక్కును అందజేశారు. టీటీడీకి గతంలోనూ ఆనందప్రసాద్ రూ. కోటి విరాళం ఇచ్చిన విషయం విధితమే. 
 
టీటీడీ ఆధ్వర్యంలోని బర్డ్స్ ట్రస్టుకు 2015లో ఆ మొత్తాన్ని అందజేశారు. ఆనంద ప్రసాద్ కుటుంబం హైదరాబాద్ నగరంలోని భవ్య భవన సముదాయ ప్రాంగణాలలో ఏడుకొండల వెంకటేశ్వరస్వామి దేవాలయలు కూడా నిర్మించిన  సంగతి తెలిసిందే. భ‌వ్య బేన‌ర్‌పై ప‌లు విజ‌య‌వంత‌మైన సినిమాలు నిర్మించిన ఆనంద్‌ప్ర‌సాద్ ఇటీవ‌లే నితిన్‌తో చెక్ సినిమా నిర్మించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు