మరో జన్మంటూ ఉంటే ఐపిఎస్ అవుతా.. విలక్షణ హీరోయిన్ మనోగతం

సోమవారం, 29 ఏప్రియల్ 2019 (16:04 IST)
కోలీవుడ్‌లో శింబు హీరోగా నటించిన "పోడాపోడి" సినిమాతో వెండితెరకు పరిచయమైన నటి వరలక్ష్మి శరత్‌కుమార్. కేవలం హీరోయిన్ పాత్రలు, గ్లామర్ రోల్స్‌కే పరిమితంకాకుండా విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. విశాల్‌ 'సండైకోళి', విజయ్‌ 'సర్కార్‌' సినిమాల్లో విలన్‌గా నటించి అందరినీ మెప్పించింది. తాజాగా ‘రాజపార్వై’ అనే సినిమాలో ఐపీఎస్‌గా నటించినట్లు పేర్కొంటూ ట్విట్టర్‌‌లో అందుకు సంబంధించిన వీడియో ఒకటి షేర్ చేసింది. 
 
ఈ సందర్భంగా 'మరో జన్మ ఉంటే ఖచ్చితంగా పోలీసు అవ్వాలనుకుంటున్నాను. వృత్తిపై ఎంతగానో ప్రేమను పెంచుకున్న తనకు ఇలాంటి విభిన్న పాత్రలు ఇస్తున్న దర్శకులకు ధన్యవాదాలు. అలాగే నేను ఏ పాత్ర చేసినా కూడా నన్ను యాక్సెప్ట్ చేస్తున్న నా అభిమానులకు కూడా ధన్యవాదాలు. మీ అందరి ప్రోత్సాహం ఉంటే నేను మరిన్ని విభిన్నమైన పాత్రల్లో నటించి మెప్పిస్తా'నని పేర్కొన్నారు. వైరల్‌గా మారిన ఈ వీడియోకు అభిమానులు 'పోలీసు ఆఫీసర్ పాత్రలో నటించేందుకు మీరే కరెక్ట్‌ పర్సన్‌. ఐపీఎస్‌, ఐఎఎస్ కాదు ఏ పాత్రలోనైనా సరే మీరు అవలీలగా ఒదిగిపోగలరంటూ' ప్రశంసలు కురిపిస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు