తెలుగులో సరైన విజయం లేకపోయినా విజయ్ దేవరకొండ కు మంచి ఫాలోయింగ్ వుంది. ఇటీవలే ప్రధాని అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మైహోమ్ రామేశ్వరావుతో కలిసి గడిపిన అంశాలు కూడా అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో భాగ్యశ్రీ బొర్సె హీరోయిన్గా నటిస్తోంది. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చున్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఈ చిత్రం మా బేనర్ లో మరో హిట్ చిత్రం అవుతుందని నాగవంశీ ఇటీవలే సూచాయిక తెలిపారు.