ఈ విషయం గురించి స్వయంగా విజయశాంతి తెలుపుతూ.. తెలంగాణ ఉద్యమంలో బిజీగా ఉండడం, అనారోగ్యం కారణంగా ఆపరేషన్ చేయించుకోవడం వంటి కారణాల వలన తాను కొంతకాలంగా సినిమా రంగానికి దూరం కావాల్సి వచ్చిందని తెలిపారు. అయితే తానిప్పుడు సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నానని, తాను ఓ సినిమా తీయాలని నిర్ణయించానన్నారు. తన పాత్రకు తగిన విధంగా కథను ఎంపిక చేస్తున్నట్టు తెలిపారు. తాను తీయబోయే సినిమా దేశ భక్తితో కూడుకున్నదిగా ఉంటుందని విజయశాంతి స్పష్టంచేశారు.